పంచసూత్రాలతో ప్రాణం పదిలం

ABN , First Publish Date - 2021-05-09T07:57:39+05:30 IST

కరోనా నుంచి కోలుకోవడానికి మందులతోపాటు ఆహారం కూడా అత్యంత ఆవశ్యకం. మందులు రుగ్మతలతో పోరాడతాయి. మంచి ఆహారం.. కుంగిపోయిన శరీరానికి కొత్త ఉత్తేజానిస్తుంది...

పంచసూత్రాలతో ప్రాణం పదిలం

  • బాదం నుంచి కిచిడీ వరకూ..: కేంద్రం

న్యూఢిల్లీ, మే 8: కరోనా నుంచి కోలుకోవడానికి మందులతోపాటు ఆహారం కూడా అత్యంత ఆవశ్యకం. మందులు రుగ్మతలతో పోరాడతాయి. మంచి ఆహారం.. కుంగిపోయిన శరీరానికి కొత్త ఉత్తేజానిస్తుంది.  ఈ నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి కోలుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆహార నియమాలను సూచిస్తోంది. ఇదేమీ ఖరీదైనది కాకపోవడం గమనార్హం. అయితే, నాణ్యమైనవి తీసుకోవాలి మరి!


ఇవే ప్రాణం నిలిపే ‘పంచశీల’.. 

1. ఉదయం నిద్ర లేచి బ్రష్‌ చేశాక.. బాదం(ముందు రోజు రాత్రి నానబెట్టాలి), ఎండుద్రాక్ష తినాలి. ప్రొటీన్ల గని బాదాం, ఎండుద్రాక్షతో ఐరన్‌ శరీరానికి అందుతుంది.

2. ఆ తర్వాత.. టిఫిన్‌.. రాగి(కొన్ని ప్రాంతాల్లో సోళ్లంటారు) దోశలు, ఒక కప్పు గంజి.. ఓ మంచి ఎంపిక.

3. మధ్యాహ్నం భోజనంలో రోటీలతో బెల్లం, నెయ్యి తినండి.   

4. రాత్రి.. కిచిడి ఎంతో మేలు. మనకు నిద్ర పట్టడంలో కూడా ఎంతో ఉపకరిస్తుంది.

5. రోజూ మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే.. నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ తాగే విధంగా ప్లాన్‌ చేసుకోవాలి. 


Updated Date - 2021-05-09T07:57:39+05:30 IST