బదిలీ ఉద్యోగులకు సన్మానం
ABN , First Publish Date - 2022-07-08T03:15:48+05:30 IST
బదిలీపై వెళ్లిన అధికారులను, సిబ్బందిని గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో కా
ఉదయగిరి రూరల్, జూలై 7: బదిలీపై వెళ్లిన అధికారులను, సిబ్బందిని గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో కార్యాలయంలో టైపిస్టుగా పనిచేస్తున్న పద్మావతి, తిరుమలాపురం పంచాయతీ కార్యదర్శి సుధాకర్, ఉదయగిరి పంచాయతీ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులను ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్, నాయకులు మూలె సుబ్బారెడ్డి, కార్యాలయ సిబ్బంది శాలువాలు, పూలమాలలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ మల్లికార్జున, సీనియర్ అసిస్టెంట్ నవాజ్, పంచాయతీ కార్యదర్శులు అమర్నాథ్రెడ్డి, కరిముల్లా, శ్రీనివాసులు, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.