మద్యం ప్రియులకు కిక్కు దించే వార్త ఇదీ....

ABN , First Publish Date - 2021-05-12T01:20:02+05:30 IST

రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో భాగంగా బుధవారం ఉదయం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోవడం

మద్యం ప్రియులకు కిక్కు దించే వార్త ఇదీ....

హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో భాగంగా బుధవారం ఉదయం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోవడం అనుమానంగానే కనిపిస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ప్రజా కార్యకలాపాలకు ప్రభుత్వం అవకాశం కల్పించినా, బార్, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు మాత్రం 10 లోపు తెరిచే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆబ్కారీ శాఖ అధికారులే స్పష్టం చేస్తున్నారు. అయితే ఉదయం 10 గంటల  లోపు మద్యం అమ్మకాలను అనుమతించాలంటే మాత్రం నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచే రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలు, దాదాపు 1,200 బార్‌లు, 15 మైక్రో బ్రేవరేజీలను సీజ్ చేసేందుకు ఆబ్కారీ సమాయత్తమవుతోంది. రాత్రి 8 గంటలకు వీటిని సీజ్ చేసేందుకు ఎక్సైజ్ స్టేషన్ల వారీగా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. 


Updated Date - 2021-05-12T01:20:02+05:30 IST