బీసీలు, దళితులకే పెద్దపీట!

ABN , First Publish Date - 2020-10-01T08:02:46+05:30 IST

తెలుగు మహిళ పార్లమెంటు నియోజకవర్గాల కమిటీలను గురువారం ప్రకటించనున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈ కమిటీలను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి...

బీసీలు, దళితులకే పెద్దపీట!

  • నేడు తెలుగు మహిళ కమిటీల ప్రకటన


తెలుగు మహిళ పార్లమెంటు నియోజకవర్గాల కమిటీలను గురువారం ప్రకటించనున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈ కమిటీలను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి లోక్‌సభ స్థానానికి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పేర్లను ప్రకటిస్తారు. మిగతా కార్యవర్గాన్ని ఆతర్వాత ఖరారు చేస్తారు. తెలుగు మహిళ నియామకాల్లో కూడా సామాజిక న్యాయానికి ఆ పార్టీ పెద్ద పీట వేసింది. మొత్తం పది కమిటీల అధ్యక్ష పదవులు బీసీలకు ఇచ్చారు. పదకొండు ప్రధాన కార్యదర్శి పదవులు ఆ వర్గానికే దక్కాయి. ఎనిమిది ప్రధాన కార్యదర్శి పదవులను దళితులకు కేటాయించారు. ఎస్టీలకు ఒక అధ్యక్ష పదవి, ఒక ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. 

Updated Date - 2020-10-01T08:02:46+05:30 IST