దళిత మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి: బచ్చుల అర్జనుడు

ABN , First Publish Date - 2020-08-15T17:54:55+05:30 IST

విజయవాడ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి టీడీపీ నేతలు మెమోరాండం సమర్పించారు.

దళిత మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి: బచ్చుల అర్జనుడు

విజయవాడ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి టీడీపీ నేతలు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ.. అందరికీ 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసిన మోసానికి నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామన్నారు. దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుందన్నారు. దళిత మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాలను ప్రభుత్వం గౌరవించడం లేదన్నారు. ప్రభుత్వం దుర్మార్గపు చర్యలను నిలదీస్తే కేసులు పెడుతున్నారని బచ్చుల అర్జనుడు పేర్కొన్నారు.


Updated Date - 2020-08-15T17:54:55+05:30 IST