డాక్టర్ నిర్లక్ష్యానికి బాలింత బలి
ABN , First Publish Date - 2022-08-09T04:23:54+05:30 IST
డాక్టర్ నిర్లక్ష్యానికి వైద్యం వికటించి బాలింతమృతి చెందిందని శ్రీనగ రం ప్రజలు మండిపడ్డారు.
మైదుకూరు రూరల్ ఆగ స్టు 8: డాక్టర్ నిర్లక్ష్యానికి వైద్యం వికటించి బాలింతమృతి చెందిందని శ్రీనగ రం ప్రజలు మండిపడ్డారు. బాధితులు తెలిపిన సమాచారం మేరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి 10.30కు కందుకూరి జిలేక ప్రసవ నొప్పులతో భాధ పడుతోం ది. ఆమె భర్త ఖాదర్బాష ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా అప్పుడు విధుల్లో ఉన్న నరసింహ ఆమెకు డెలివరి చేసి మగబిడ్డ జన్మించినట్లు తెలిపారు. తరువాత చాలా సేపటి వరకు రక్తస్రావం ఆగక పోవడంతో డాక్టర్ సలహా మేరకు, ఆమెను కడప రిమ్స్కు తీసుకెళుతుండగా మార్గ మధ్యలోనే ఆమె మరణించిన ట్లు భర్త ఆరోపించారు. అనంతరం బాధితులు డాక్టర్ నిర్లక్ష్యానికే జిలేక చనిపోయిందని మృతురాలి శవాన్ని ఆస్పత్రి ఎదుట ఉంచి ధర్నాకు దిగారు. సీఐ చలపతి బాధితులకు సర్దిచెప్పి శవాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.