జూమ్ మీటింగ్లతో బాబు కాలక్షేపం: బాలినేని
ABN , First Publish Date - 2020-11-30T09:44:34+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు జూమ్ మీటింగ్లతో కాలక్షేపం చేస్తూ కూర్చుంటే ప్రజలు హర్షించరని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
ఒంగోలు (కలెక్టరేట్), నవంబరు 29: టీడీపీ అధినేత చంద్రబాబు జూమ్ మీటింగ్లతో కాలక్షేపం చేస్తూ కూర్చుంటే ప్రజలు హర్షించరని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం మా ట్లాడారు. నివర్ తుఫాను కారణంగా రాష్ట్రం అతలాకుతలం అయితే ప్రతిపక్షనేతగా రైతులను కనీసం పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు.