రుచి సోయా బోర్డులోకి బాబా రామ్‌దేవ్...

ABN , First Publish Date - 2020-11-29T22:01:17+05:30 IST

రుచి సోయా మేనేజింగ్ డైరెక్టర్‌గా యోగా గురువు బాబా రామ్‌దేవ్ సోదరుడు రామ్ భరత్ నియమితులయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 19 న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రుచి సోయా తెలిపింది.

రుచి సోయా బోర్డులోకి బాబా రామ్‌దేవ్...

న్యూఢిల్లీ : రుచి సోయా మేనేజింగ్ డైరెక్టర్‌గా యోగా గురువు బాబా రామ్‌దేవ్ సోదరుడు రామ్ భరత్ నియమితులయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 19 న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రుచి సోయా తెలిపింది. రామ్ భరత్ నియామకం ఈ ఏడాది ఆగస్టు 19 నుండే అమలులోకి వచ్చిందని, 2022 డిసెంబర్ 17 వరకు వరకు పదవిలో కొనసాగుతారని వెల్లడించింది.


కాగా బాబా రామ్‌దేవ్‌ను  డైరెక్టరుగా  నియమించేందుకు కూడా వాటాదారుల అనుమతిని కోరింది రుచి సోయా. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. అంతకుముందు దివాలా తీసిన రుచి సోయా ఇండస్ట్రీని గతేడాది పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌, దివ్య యోగ్ మందిర్ ట్రస్ట్, పతంజలి పరివర్తన్ ప్రైవేట్ లిమిటెడ్, పతంజలి గ్రామోద్యోగ్ సంస్థలతో కూడిన కన్సార్షియం కొనుగోలు చేసింది. దీంతో ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డును నియమించే హక్కు కొత్త యాజమాన్యానికి లభించినట్లు రుచి సోయా ఇండస్ట్రీస్ వెల్లడించింది.


కాగా... రామ్ భరత్‌కు వార్షిక వేతనం కింది  రూ. కోటి చెల్లించనున్నారు. ఇక... ఆచార్య బాలకృష్ణ హోదాను చైర్మన్‌గా మార్చింది. ఇతని వార్షిక వేతనం కూడా రూ. కోటి. 

Updated Date - 2020-11-29T22:01:17+05:30 IST