జగన్ దొంగలెక్కలను ప్రజలు గ్రహించాలి
ABN , First Publish Date - 2022-06-30T06:03:15+05:30 IST
గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు సంక్షేమం అందిస్తూ, వారు సంపాదించుకునే సదుపాయం కల్పించగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజల నుంచి దొరికినంత కాజేస్తున్నారని కాజేయడం పేటెంట్ హక్కుగా ముఖ్య మంత్రి జగన్ భావిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ విమర్శించారు.
జగన్ దొంగలెక్కలను ప్రజలు గ్రహించాలి
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
భారతీనగర్, జూన్ 29: గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు సంక్షేమం అందిస్తూ, వారు సంపాదించుకునే సదుపాయం కల్పించగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజల నుంచి దొరికినంత కాజేస్తున్నారని కాజేయడం పేటెంట్ హక్కుగా ముఖ్య మంత్రి జగన్ భావిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ విమర్శించారు. 4వ డివిజన్లోని ఏపీఐఐసీ కాలనీలో బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల తూముల భాస్కరరావు చనిపోగా ఆయన కుటుంబ సభ్యులకు రూ. ఐదు వేలు ఆర్థిక సహాయాన్ని గద్దె అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సిగ్గు పడేలా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తీరుందన్నారు. బడ్జెట్లో పెట్టిన రూ.66 వేల కోట్లు కనబడటంలేదని కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థ కాగ్ తన నివేదికలో చెప్పిందన్నారు. జగన్ ఏ విధంగా దొంగ లెక్కలు వేస్తున్నారో రాష్ట్ర ప్రజలు గ్రహించాలన్నారు. డివిజన్ కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, దేవినేని అపర్ణ, డివిజన్ పార్టీ ఆధ్యక్షుడు గొల్లపూడి నాగేశ్వరావు, బత్తుల దుర్గారావు, కోడూరు ఆంజనేయులు, అబ్దుల్ రషీద్, కర్రి ఉమామహేశ్వరి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.