కాకినాడలో బీన్యూ షోరూమ్
ABN , First Publish Date - 2020-10-19T05:46:30+05:30 IST
మొబైల్ రిటైలింగ్ కంపెనీ బీన్యూ కాకినాడలో కొత్త షోరూమ్ను సోమవారం ప్రారంభిస్తోంది. తెలుగు రాష్ర్టాల్లో ఇది 81వ
హైదరాబాద్: మొబైల్ రిటైలింగ్ కంపెనీ బీన్యూ కాకినాడలో కొత్త షోరూమ్ను సోమవారం ప్రారంభిస్తోంది. తెలుగు రాష్ర్టాల్లో ఇది 81వ షోరూమ్ కాగా ఆంధ్రప్రదేశ్లో 57వ షోరూమ్ అని కంపెనీ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి చెప్పారు. 6 సంవత్సరాల క్రితం తొలి షోరూమ్ ప్రారంభించి కస్టమర్ల ఆదరాభిమానాలతో విస్తరించుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నామని ఆయన అన్నారు.
తమ షోరూమ్లలో రూ.500 నుంచి రూ.1.5 లక్షల శ్రేణిలో మొబైల్ ఫోన్లు, రూ.13 వేల నుంచి రూ.70 వేల శ్రేణిలో ఎంఐ, టీసీఎల్, రియల్ మీ టీవీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ షోరూమ్ ప్రారంభిస్తున్న సందర్భంగా కాకినాడ కస్టమర్లకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందించనున్నట్టు ఆయన చెప్పారు.