బేగంపేట్ పీఎస్లో అజారుద్దీన్ ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-01-28T02:45:06+05:30 IST
నగరంలోని బేగంపేట్ పీఎస్లో అంబుడ్స్మెన్పై హెచ్సీఏ అధ్యక్షుడు
హైదరాబాద్: నగరంలోని బేగంపేట్ పీఎస్లో అంబుడ్స్మెన్పై హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు. హెచ్సీఏ ప్రస్తుత కార్యవర్గాన్ని జింఖానా ఆఫీస్లో అంబుడ్స్మెన్ వారు భయపెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. అజారుద్దీన్ ఫిర్యాదును బేగంపేట్ పోలీసులు స్వీకరించారు. అంబుడ్స్మెన్, అజారుద్దీన్ మధ్య కొద్దిరోజులుగా వివాదం జరుగుతోంది. వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్నది.