సమాజ్‌వాదీ పార్టీ MLAs meet కు Azam Khan, Shivpal గైర్హాజర్

ABN , First Publish Date - 2022-05-22T22:20:44+05:30 IST

యూపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదివారంనాడు ఏర్పాటు చేసిన.. ఎమ్మెల్యేల సమావేశానికి

సమాజ్‌వాదీ పార్టీ MLAs meet కు Azam Khan, Shivpal గైర్హాజర్

లక్నో: యూపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh yadav) ఆదివారంనాడు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశానికి ఆ పార్టీ నేతలు అజాం ఖాన్ (Azam khan) శివపాల్ యాదవ్ (Shivapal yadav) గైర్హాజర్ అయ్యారు. ఇటీవలే సీతాపూర్ జైలు నుంచి బెయిలుపై విడుదలైన అంజాఖాన్ తన నియోజకవర్గమైన రాంపూర్‌లో ఉన్నారు. ఖాన్‌తో పాటు ఆయన కుమారుడు, శాసనసభ్యుడు అబ్దుల్లా అజామ్ కూడా హాజరు కాలేదు. అఖిలేష్ పై అజాంఖాన్ అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తండ్రీకొడుకులు ఇరువురూ ఎస్పీ ఎమ్మెల్యేల సమావేశానికి గైర్హాజరుకావడం చర్చనీయాంశమైంది.


కాగా, అజాంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా సోమవారంనాడు జరిగే సమావేశానికి హాజరవుతారని, ఆరోగ్య కారణాల రీత్యా ఖాన్ ఇవాల్టి సమావేశానికి హాజరుకాలేదని ఎస్పీ ఎమ్మెల్యే రవిదాస్ మెహ్రోత్రా తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఖాన్ తొలుత ప్రమాణస్వీకారం చేసి సమావేశాలకు హాజరవుతారని చెప్పారు. కాగా, ఎస్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు అఖిలేష్ యాదవ్ దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాలను ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేవనెత్తాలని సూచన చేశారు.

Updated Date - 2022-05-22T22:20:44+05:30 IST