ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవం

ABN , First Publish Date - 2022-08-13T05:12:39+05:30 IST

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా మండల కేంద్రమైన దువ్వూరులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు ఆజాదికా అమృత మహోత్సవ్‌ ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవం
దువ్వూరులో జెండా ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

దువ్వూరు, ఆగస్టు 12: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా మండల కేంద్రమైన దువ్వూరులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపుమేరకు ఆజాదికా అమృత మహోత్సవ్‌ ఘనంగా నిర్వహించారు. వందలాది మంది విద్యార్థుల నడుమ జాతీయ జెండాలను పట్టుకుని దువ్వూరు ప్రధాన రహదారిలో పార్టీలకతీతంగా దువ్వూరు ఎస్‌ఐ కేసీ రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరవేటి హరికృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో నినాదాలు చేస్తూ అంగరంగ వైభవంగా త్రిరంగ ర్యాలీ చేశారు.

Updated Date - 2022-08-13T05:12:39+05:30 IST