గుంటూరులో ఆజాదీ అమృత్ మహోత్సవాలు

ABN , First Publish Date - 2022-03-08T13:29:20+05:30 IST

గుంటూరులో ఆజాదీ అమృత్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

గుంటూరులో ఆజాదీ అమృత్ మహోత్సవాలు

గుంటూరు: గుంటూరులో ఆజాదీ అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఈ ఉత్సవాల్లో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆజాదీ అమృత్ మహోత్సవాల్లో భాగంగా వీవీఐటీ విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు. దర్గా టూ దుర్గ పేరుతో ప్రతి ఏడాది వీవీఐటీ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చేపడతారు. దర్గా వద్ద ఈ ర్యాలీని అడిషనల్ ఎస్పీ సుప్రజ ప్రారంభించారు. విజయవాడ దుర్గ గుడి వరకు 33 కిలోమీటర్ల  వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. 


Updated Date - 2022-03-08T13:29:20+05:30 IST