అయ్యప్ప, భవాని భక్తులకు భోజన ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-10-26T04:38:59+05:30 IST
అయ్యప్ప, భవానీ దీక్షాధారులకు వీరభద్ర అన్నదాన కమిటీ, ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 41 రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేశారు.
కామవరపుకోట, అక్టోబరు 25: అయ్యప్ప, భవానీ దీక్షాధారులకు వీరభద్ర అన్నదాన కమిటీ, ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 41 రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేశారు. సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు కడిపి పాపారావు, మారం రమేష్, వీరమళ్ళ మధు, ఎంపీటీసీ బొల్లు సత్యనారాయణ నిత్యాన్నదానం ప్రారంభించారు. మేడవరపు అశోక్, కడిమి రమేష్, మేడూరి రంగబాబు, రాజా రాఘవరాజు చినరామకృష్ణంరాజు (చిన్నబాబు) పాల్గొన్నారు. డిసెంబర్ 6 వరకు నిరంత రం నిత్యాన్నదానం నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలియచేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కొండూరు శ్రీధర్ భక్తులకు ఏర్పాట్లు చేశారు.