ఇవాళ మనసంతా చాలా బాధగా ఉంది : అయ్యన్న పాత్రుడు

ABN , First Publish Date - 2020-09-25T22:47:17+05:30 IST

ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో...

ఇవాళ మనసంతా చాలా బాధగా ఉంది : అయ్యన్న పాత్రుడు

విశాఖపట్నం : ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం విదితమే. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. కొద్దిసేపటి క్రితం జిల్లా టీడీపీ కార్యాలయంలో నేతలు అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు నివాళులు అర్పించారు. బాలు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.


మనసు చాలా బాధగా ఉంది..

ఎస్పీ బాలు గారి స్వర్గస్తులయ్యారన్న వార్త విని చాలా బాధపడ్డాం. ఇవాళ మనసు అంతా చాలా బాధగా ఉంది. బాలు చాలా పెద్ద గాయకుడు. ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడారు. ఎంతో మంది యువ గాయకులను పరిచయం చేసిన మహా వ్యక్తి. ఎస్పీ లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాముఅని అయ్యన్న చెప్పారు.

Updated Date - 2020-09-25T22:47:17+05:30 IST