రాక్షస పాలన నుంచి ఏపీని కాపాడాలి: Ayyanna Patrudu

ABN , First Publish Date - 2022-06-01T20:48:08+05:30 IST

రాక్షస పాలన నుంచి ఏపీని కాపాడాలని శ్రీనివాసుని కోరుకున్నట్లు అయ్యన్న పాత్రుడు చెప్పారు.

రాక్షస పాలన నుంచి ఏపీని కాపాడాలి: Ayyanna Patrudu

Tirumala: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాక్షస పాలన నుంచి ఏపీని కాపాడాలని శ్రీనివాసుని కోరుకున్నట్లు చెప్పారు. ‘‘స్వామీ మమ్మల్ని రక్షించడం కాదు.. తిరుపతిని నీవే కాపాడుకో తండ్రీ.. ఇక్కడ చాలా దోపిడీ జరుగుతోంది’’.. అంటూ ప్రార్థించినట్లు చెప్పారు. శ్రీవాణి టిక్కెట్ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టిక్కెట్ ఖరీదు రూ. 10,500. అయితే తన కుటుంబానికి రూ. 75,000 పెట్టి టిక్కెట్లు తీసుకున్నానని చెప్పారు. అందులో రూ. 3,500 స్వామివారికి వెళుతుందని, మిగిలిగిన డబ్బులు ట్రస్టుకు వెళుతున్నాయన్నారు. దీనికి అకౌంట్స్ ఉన్నాయా? అని ప్రశ్నించారు. అలాగే స్వామీజీలు హిందూ ధర్మ ప్రచారాలు మరిచిపోయి రాజకీయ భజన చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.

Updated Date - 2022-06-01T20:48:08+05:30 IST