టీడీపీనేత రాజుది హత్యే..: అయ్యన్నపాత్రుడు
ABN , First Publish Date - 2022-03-22T17:41:35+05:30 IST
టీడీపీనేత కల్యాణ్ రాజు మృతిపై మిస్టరీ వీడలేదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ పీఎస్ ఎదుట టీడీపీ ఆందోళన చేపట్టింది.
విశాఖ: టీడీపీనేత కల్యాణ్ రాజు మృతిపై మిస్టరీ వీడలేదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ పీఎస్ ఎదుట టీడీపీ ఆందోళన చేపట్టింది. ధర్నాలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. నాతవరంలో టీడీపీనేత రాజుది హత్యేనన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో కల్యాణ్ రాజు మృతిపై వాస్తవాలు వెలుగులోకి రావడం లేదన్నారు. నర్సీపట్నం పోలీసు విచారణపై తమకు నమ్మకం లేదని చెప్పారు. సీఐడీ లేదా సీనియర్ ఐఏఎస్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని అయ్యన్నపాత్రుడు చెప్పారు.