సాయుధ దళ కార్యాలయంలో ఆయుధపూజ
ABN , First Publish Date - 2021-10-15T05:36:28+05:30 IST
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం మహార్నవమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయంలో ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు.
గద్వాల టౌన్, అక్టోబరు 14 : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం మహార్నవమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయంలో ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు. పోలీసుల ఆయుధాలు, ఎంటీ సెక్షన్కు చెందిన వాహనాలకు పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ జే రంజన్ రతన్ కుమార్ జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు విభాగం చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే విజయదశమి అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి, ఏఈ సతీష్ కుమార్, సాయుధదళ డీఎస్పీ ఇమ్మానియోల్, గద్వాల సీఐ ఎస్ఎం బాషా, ఆర్ఐ అడ్మిషన్ నాగేష్, ఎస్ఐలు హరిప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమాదేవి, గాయత్రి, శైలేంద్ర కుమార్ పాల్గొన్నారు.