గోగర్భం డ్యామ్ వద్ద ఆయుధపూజ
ABN , First Publish Date - 2021-10-28T06:43:14+05:30 IST
తిరుమలలోని గోగర్భం డ్యామ్ వద్దనున్న టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆయుధపూజ నిర్వహించారు.
తిరుమల, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని గోగర్భం డ్యామ్ వద్దనున్న టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆయుధపూజ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. సబ్స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ రవిశంకర్రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం తిరుమలలోని రవాణా విభాగంలోనూ ఆయుధ పూజలను నిర్వహించారు. జీఎం శేషారెడ్డి, డీఐ జానకిరామారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసెప్షన్ డిప్యూటీఈవో ఆర్1 లోకనాథం, గార్డెన్ డిప్యూటీడైరెక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.