అయోధ్యలో బంగారు కిరీటాన్ని ధరించిన శ్రీరాముడు

ABN , First Publish Date - 2021-04-21T17:46:35+05:30 IST

యూపీలోని అయోధ్యలో ఈ రోజు శ్రీరామ నవమి వేడుకలు...

అయోధ్యలో బంగారు కిరీటాన్ని ధరించిన శ్రీరాముడు

అయోధ్య: యూపీలోని అయోధ్యలో ఈ రోజు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రభుత్వం తరపున శ్రీరామునికి పట్టువస్త్రాలు సమర్పించారు. వీటిని అలయ అర్చకులు శ్రీరామునికి ధరింపజేశారు. అనంతరం శ్రీరాముని ఉత్సవ మూర్తికి నూతన కిరీటాన్ని ధరింపజేశారు. ఇదేవిధంగా శ్రీరాముని పక్కనే కొలువుదీరిన అన్నదమ్ములకు కూడా కిరీటాలు ధరింపజేశారు. కరోనా విపత్తు కొనసాగుతుండటంతో అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు భక్తుల సందడి లేకుండానే కొనసాగుతున్నాయి. అయితే కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ కలిగిన భక్తులకు మాత్రమే ఆలయంలోనికి ప్రవేశం కల్పిస్తున్నారు. 




Updated Date - 2021-04-21T17:46:35+05:30 IST