తొమ్మిదేళ్లు జైల్లో ఉంచారు... రూ.10 కోట్లు పరిహారం కావాలి: సత్యంబాబు

ABN , First Publish Date - 2021-11-19T01:47:09+05:30 IST

ఆయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించారని సత్యం బాబు వాపోయారు. ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు...

తొమ్మిదేళ్లు జైల్లో ఉంచారు... రూ.10 కోట్లు పరిహారం కావాలి: సత్యంబాబు

విజయవాడ: ఆయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించారని సత్యం బాబు వాపోయారు. ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు హాజరయ్యారు. జైలులో ఉండటం వల్ల తన కుటుంబం చాలా ఇబ్బందులు పడిందని నివేదించారు. క్రిమినల్ అని ముద్ర వేయడంతో సామాజిక బహిష్కరణకు గురయ్యామని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.


అక్రమంగా కేసు పెట్టి తొమ్మిదేళ్లు జైల్లో ఉంచిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని జాతీయ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ డిమాండ్ చేశారు. సత్యంబాబు కోరుకున్న విధంగా రూ. 10 కోట్లు పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన ఎన్వీ రమణ  కృష్ణా జిల్లా వాసి అయినందున పరిస్థితిని అర్ధం చేసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-11-19T01:47:09+05:30 IST