ఆక్యుపేషనల్‌ థెరపీ ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ

ABN , First Publish Date - 2021-10-28T06:15:28+05:30 IST

ఆక్యుపేషనల్‌ థెరపీతో శారీరక, మానసిక సమస్యలు దూరం అవుతాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ డా.జె. అరుణ, ఎస్‌.. రామ్‌ ప్రసాద్‌ అన్నారు.

ఆక్యుపేషనల్‌ థెరపీ ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ

ఆక్యుపేషనల్‌ థెరపీ ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ

సత్యనారాయణపురం, అక్టోబరు 27: ఆక్యుపేషనల్‌ థెరపీతో శారీరక, మానసిక సమస్యలు దూరం అవుతాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌  డా.జె. అరుణ, ఎస్‌.. రామ్‌ ప్రసాద్‌ అన్నారు. బీఆర్టీఎస్‌ రోడ్డులో బుధవారం ఆక్యుపేషనల్‌ థెరపీ డే సందర్భంగా హ్యాపీ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీ హ్యాబిలిటేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యనా అవగాహన వాక్‌దన్‌ కార్యక్రమం జరిగింది. వారిరువురు వాక్‌దన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆక్యుపేషనల్‌ థెరపీ ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి  వాక్‌దన్‌ ఉపయోగ పడుతుందన్నారు. ఫుడ్‌ జంక్షన్‌ నుంచి పడవలరేవు సెంటర్‌ వరకూ అవగాహన ర్యాలీ జరిగింది. టీ. గాయత్రీదేవి, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T06:15:28+05:30 IST