హోం క్వారంటైన్‌పై అవగాహన

ABN , First Publish Date - 2020-04-04T10:09:33+05:30 IST

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెళ్లి, కట్కూర్‌లో ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరికి

హోం క్వారంటైన్‌పై అవగాహన

అక్కన్నపేట/మద్దూరు, ఏప్రిల్‌ 3: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెళ్లి, కట్కూర్‌లో ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరికి శుక్రవారం కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏసీపీ మహేందర్‌, మండల వైద్యాధికారి మురళీకృష్ణ అవగాహన కల్పించారు. వారివెంట తహసీల్దార్‌ వేణుగోపాలరావు, ఎంపీడీవో సత్యపాల్‌ రెడ్డి, ఎస్‌ఐ పాపయ్య నాయక్‌, సిబ్బంది ఉన్నారు. మద్దూరులో ఇటీవల క్వారంటైన్‌కు పంపిన వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులకు మద్దూరు పీహెచ్‌సీ సీహెచ్‌వో శేషగిరి, ఎంపీడీవో రమాదేవి కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

Updated Date - 2020-04-04T10:09:33+05:30 IST