పాఠశాలల మ్యాపింగ్పై అవగాహన
ABN , First Publish Date - 2022-01-22T04:50:25+05:30 IST
నూతన విద్యావిఽధానంలో భాగంగా పాఠశాలల మ్యాపింగ్కు సంబంఽధించి శుక్రవారం స్థానిక శ్రీషిర్డీసాయి డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- బొబ్బిలిరూరల్, జనవరి 21: నూతన విద్యావిఽధానంలో భాగంగా పాఠశాలల మ్యాపింగ్కు సంబంఽధించి శుక్రవారం స్థానిక శ్రీషిర్డీసాయి డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ జాయింట్ డైరెక్టరు, జిల్లా ప్రత్యేకాధికారి జి.నాగమణి మాట్లాడుతూ.. ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల పైబడి ఉన్న ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠ శాలల మ్యాపింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయిందన్నారు. వీటికి సంబంధించి ఇంకేమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని మినహా యించాల్సి ఉంటుందని చెప్పారు. నేషనల్ హైవే, స్టేట్ హైవే, కాలువల పక్కన ఉండే పాఠశాలల వివరాలను మ్యాపింగ్ చేసి శనివారం లోగా డైరెక్టర్ కార్యాల యానికి పంపాలని సూచించారు. జిల్లా ఇన్చార్జి విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీ, ఏఎస్వోలు డివిజన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈవోలో, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.