17న కార్మిక శాఖ ఆధ్వర్యంలో కొవిడ్పై అవగాహన
ABN , First Publish Date - 2020-12-06T05:03:39+05:30 IST
జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న కరోనా నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టనున్నట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
దాసన్నపేట : జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న కరోనా నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టనున్నట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యాపారవర్గాలు, అక్కడ పనిచేస్తున్న కార్మికులతో ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం చేపడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా షాపుల ముందు ఎవరికి వారు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయాలని సూచించారు. వినియోగదారులకు కూడా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.