గుడుంబా నిర్మూలనపై అవగాహన

ABN , First Publish Date - 2021-01-24T05:54:37+05:30 IST

మండలంలోని చెమ్మన్‌గుడి, ఫకీర్‌ నాయక్‌తండా, వాయిపేట్‌ గ్రామాల్లో శనివారం అబ్కారీ శాఖాధికారులు, పోలీసు శాఖవారి ఆధ్వర్యం లో సంయుక్తంగా నాటుసారా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.

గుడుంబా నిర్మూలనపై అవగాహన
గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సైలు

సిరికొండ, జనవరి 23: మండలంలోని చెమ్మన్‌గుడి, ఫకీర్‌ నాయక్‌తండా, వాయిపేట్‌ గ్రామాల్లో శనివారం అబ్కారీ శాఖాధికారులు, పోలీసు శాఖవారి ఆధ్వర్యం లో సంయుక్తంగా నాటుసారా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 12 లీటర్ల నాటుసారా, 150లీటర్ల బెల్లంపానకం, ఇప్పపువ్వు పానకం ధ్వసం చేసినట్లు ఎస్సైజ్‌ సీఐ రాజమౌళి తెలిపారు. అనంతరం సిరికొండ ఎస్సై కృష్ణకుమార్‌, ఎక్సైజ్‌ ఎస్సై లక్ష్మణ్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఆడే.రమేష్‌, సిబ్బందితో కలిసి గ్రామస్థులకు నాటుసారా నిర్మూలన గురిం చి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - 2021-01-24T05:54:37+05:30 IST