సైబర్‌ ఇంటర్నెట్‌పై అవగాహన

ABN , First Publish Date - 2020-07-16T11:58:50+05:30 IST

సైబర్‌ ఇంటర్నెట్‌ వెబ్‌ సైట్‌పై అవగాహన కల్పించేందుకు బుధవారం అదనపు డీజీ పీ, ఉమెన్స్‌ సేఫ్టీ సీఐ డీ స్వాతి లక్రా, జిల్లా అధికారులతో సమీ క్షించారు.

సైబర్‌ ఇంటర్నెట్‌పై అవగాహన

ఖిల్లా, జూలై 15: సైబర్‌ ఇంటర్నెట్‌ వెబ్‌ సైట్‌పై అవగాహన కల్పించేందుకు బుధవారం అదనపు డీజీ పీ, ఉమెన్స్‌ సేఫ్టీ సీఐ డీ స్వాతి లక్రా, జిల్లా అధికారులతో  సమీ క్షించారు. కొత్తగా ఏ ర్పాటు చేసిన సైబర్‌ నెట్‌ ద్వారా మహిళలు, బాలికల రక్షణకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆమె వివరించారు. సైబర్‌ నేరాలు జరిగినప్పుడు కేసు నమోదుతో పాటు ఇతర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో సినీ నటుడు నాని, యాంకర్‌ సుమ కనకాల, క్రీడాకారిణి పీవీ సింధూ వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొని అవగాహన కల్పించారు. జిల్లా నుంచి సీపీ కార్తికేయ, అదనపు డీజీపీ ఉషా విశ్వనాథ్‌, ఎస్‌బీఐ మధుసూధన్‌, మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ సయ్యద్‌ మస్తాన్‌అలీ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-16T11:58:50+05:30 IST