వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన

ABN , First Publish Date - 2020-05-11T11:37:26+05:30 IST

వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తున్నట్లు ఏడీఏ అన్నయ్యరెడ్డి, ఏవో చంద్రశేఖర్‌రెడ్డిలు సూచించారు.

వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన

జమ్మలమడుగు రూరల్‌, మే 10: వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తున్నట్లు  ఏడీఏ అన్నయ్యరెడ్డి, ఏవో చంద్రశేఖర్‌రెడ్డిలు సూచించారు. ఆదివారం  పట్టణంలోని మార్కెట్‌యార్డు ఆవరణలో రైతు భరోసా గోదాము వద్ద సంబందిత అధికారుల కు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జమ్మలమడు గు పట్టణంలో 11 సచివాలయాల్లో రైతు భరోసాకు సంబందించిన ఉత్పత్తులకు సంబందించి రైతులు శిక్షణ పొందవచ్చన్నారు. ఈనెల 15 నుంచి  రైతుల కు ఈ కేంద్రాల వద్ద విత్తనాలు, పురుగు మందులు తదితరవన్నీ వారి వారి ఇళ్లకు డోర్‌డెలివరి అందిస్తామన్నారు. ఆర్డర్‌ చేసుకున్న రైతులు సంబందిత సచివాలయాల వద్ద పురుగు మందులు, వ్యవసాయ సంబందించి వస్తువులను పొందాలన్నారు. సంబందిత అధికారులు ఈ-మిషన్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌పై రైతు భరోసా కేంద్ర విధి విధానాలపై శిక్షణ కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు, వీఆర్‌ఏలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-11T11:37:26+05:30 IST