జ్ఞానాంబిక కళాశాలకు బిగెనప్‌ అవార్డులు

ABN , First Publish Date - 2020-11-29T05:43:45+05:30 IST

మదనపల్లెలోని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలకు రెండు అవార్డులు

జ్ఞానాంబిక కళాశాలకు బిగెనప్‌ అవార్డులు
అవార్డులు అందుకుంటున్న గురుప్రసాద్‌

మదనపల్లె టౌన్‌, నవంబరు 28: మదనపల్లెలోని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కినట్లు కరస్పాండెంట్‌ ఆర్‌.గురుప్రసాద్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన బిగెనప్‌ రీసెర్చ్‌ ఇంటెలిజెన్స్‌  సంస్థ ఇటీవల జాతీయస్థాయిలో 30 కళాశాలలకు ఎడ్యుకేషనల్‌ ఎక్సెలెన్స్‌ అవార్డ్స్‌, కాన్ఫరెన్స్‌-2020 అవార్డులను ఎంపిక చేశారన్నారు. ఇందులో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యాబోధన, ఉద్యోగకల్పన అందించడంలో ముందు వరుసలో నిలిచినందుకు ఈ అవార్డులు అందజేశారన్నారు. దేశంలో టాప్‌ 50 డిగ్రీ కళాశాలల్లో తమ కళాశాలను ఎంపిక చేయడం ఆనందంగా వుందన్నారు. శుక్రవారం బెంగళూరులో బిగెనప్‌ సంస్థ నిర్వహించిన ఫంక్షన్‌లో ప్రముఖ రచయిత మౌసమి కె.సచ్‌దేవ్‌, వేదిక్‌ ఐఏఎస్‌ అకాడమీ చైర్మన్‌ జేమ్స్‌మాథ్యూ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నామన్నారు.

Updated Date - 2020-11-29T05:43:45+05:30 IST