ఫ్లైయాష్ వినియోగంలో సింగరేణికి అవార్డు
ABN , First Publish Date - 2021-04-11T06:02:26+05:30 IST
ఫ్లైయాష్ వినియోగంలో సింగ రేణి సంస్థ జాతీయస్థాయి అవార్డు పొందింది.
గోదావరిఖని, ఏప్రిల్ 10: ఫ్లైయాష్ వినియోగంలో సింగ రేణి సంస్థ జాతీయస్థాయి అవార్డు పొందింది. గోవాలో రెం డు రోజులుగా మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్లై యాష్ వినియోగంపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా శనివారం మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ డైరెక్టర్ మనోజ్కుమార్ చేతుల మీదుగా సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావు అందుకున్నారు. థర్మల్ విద్యుత్కేంద్రం నుండి వెలువడే ఫ్లైయాష్ను నూరు శాతం సద్వినియోగ పరిచినందుకు అత్యుత్తమ ఫ్లైయాష్ సంస్థగా అవార్డు సా ధించింది. 500 మెగావాట్ల పైబడి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న థర్మల్ ప్లాంట్ల విభాగంలో సింగరేణి ఈఅవార్డును అందు కున్నది. అవార్డు రావడం పట్ల సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఫ్లైయాష్, బాటం యాష్లను ఏమాత్రం నిల్వ ఉంచకుండా నూరు శాతం సద్వినియోగం చేయాలనే లక్ష్యానికి అనుగు ణంగా మొదటి నుంచి కృషి చేస్తన్నామని, దీని ఫలితంగా జాతీయ స్థాయి అవార్డు రావడం హర్షించదగ్గ విషయమని సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు.