మిమ్స్‌ సూపరింటెండెంట్‌కు అవార్డు

ABN , First Publish Date - 2022-08-15T05:43:31+05:30 IST

మిమ్స్‌ సూపరింటెండెంట్‌కు అవార్డు

మిమ్స్‌ సూపరింటెండెంట్‌కు అవార్డు

  • ఏపీ  గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం

వికారాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ మహావీర్‌  ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌  మెడికల్‌  సైన్సె్‌స(మిమ్స్‌)  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌  చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.  కరోనా సమయంలో రోగులకు అందించిన  సేవలకుగాను విజయవాడ ఎక్స్‌రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ వారు భారత స్వాతంత్ర వజ్రోత్సవ పురస్కారానికి  ఆయనను ఎంపిక చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం,  విజయవాడలోని  తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో  శుక్రవారం  జరిగిన స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలలో  గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు.

Updated Date - 2022-08-15T05:43:31+05:30 IST