ఉత్తమ వలంటీర్లకు అవార్డులు
ABN , First Publish Date - 2021-04-17T05:08:18+05:30 IST
నియోజకవర్గంలోని వార్డు వలంటీర్లకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శుక్రవారం అవార్డులు అందజేశారు.
బుట్టాయగూడెం, ఏప్రిల్ 16: నియోజకవర్గంలోని వార్డు వలంటీర్లకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శుక్రవారం అవార్డులు అందజేశారు. నియోజక వర్గంలోని 7 మండలాలకు చెందిన 1383 మంది వలంటీర్లు అవార్డులకు ఎంపికయ్యారు. వారికి మొత్తం రూ.1.42 కోట్లు నగదు, ప్రశంసా పత్రాలను అందజేశారు. అవార్డులతో బాధ్యత పెరిగినట్లు తెలిపారు. డీపీవో రమేష్ బాబు, ఐటీడీఏ పీవో ఆర్వి సూర్యనారాయణ, ఆర్డీవో వైవి ప్రసన్నలక్ష్మి, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, సర్పంచ్లు, కార్య దర్శులు, తదితరులు పాల్గొన్నారు.