Subbaraoను బలి పశువును చేశారు: న్యాయవాది
ABN , First Publish Date - 2022-06-25T19:25:53+05:30 IST
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఆవుల సుబ్బారావును బలి పశువును చేశారని ఆయన తరపు న్యాయవాది అన్నారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఆవుల సుబ్బారావు(Avula subbarao)ను బలి పశువును చేశారని ఆయన తరపు న్యాయవాది అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అతను ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి నేరస్తుడిని చేశారని ఆరోపించారు. అసలైన నిందితులు ఎవరో పోలీసులకు తెలుసన్నారు. సుబ్బారావు దేశ భక్తి మెండుగా ఉన్న వ్యక్తి అని, అతనిపై పోలీసులు మోపిన అభియోగాలు అన్ని తప్పుడు అభియోగాలని అడ్వకేట్ అన్నారు. అసలు సుబ్బారావు తప్పు చేశాడు అని చెప్పడానికి పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సుబ్బారావు ఏ వాట్సప్ గ్రూప్లకు అడ్మిన్గా లేడని, ఎలాంటి హింసాత్మక మెసేజెస్, వీడియోలు ఫార్వర్డ్ చేయలేదని చెప్పారు. ప్రతివారం తన అకాడమీ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వస్తారన్నారు. అందులో భాగంగా జూన్ 16న సుబ్బారావు హైదరాబాద్ వచ్చారని తెలియజేశారు. విధ్వంసం చేయడానికి కాదు... సృష్టించడానికి కాదని స్పష్టం చేశారు. న్యాయ పోరాటం చేస్తాం.. సుబ్బారావును బయటకు తీసుకు వస్తామని న్యాయవాది పేర్కొన్నారు.