నిరుపేద కుటుంబాల అభివృద్ధే ఆవోపా లక్ష్యం

ABN , First Publish Date - 2022-07-04T04:50:33+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాల అభివృద్ధే అవోపా లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షుడు తడవర్తి రాంబాబు పేర్కొన్నారు.

నిరుపేద కుటుంబాల అభివృద్ధే ఆవోపా లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న రాంబాబు

బ్రహ్మంగారిమఠం, జూలై 3: రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాల అభివృద్ధే అవోపా లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షుడు తడవర్తి రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఆయన అవోపా అధ్యక్షుడు ఎం. శేషయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వైశ్యవారధి కూర్మాల సాంబశివరావు, ఆర్థిక దాతల సహకారంతో ప్రతి నెలా ఆర్యవైశ్య నిరుపేద కుటుంబాలకు రూ.25 వేల పంపిణీలో భాగంగా ఆదివారం 25 మందికి రూ.25 వేల చొప్పున భారతి, రాష్ట్ర కోఆర్డినేటర్‌ నాగేశ్వరరావు, రమేష్‌ ఆధ్వర్యంలో ఆయన అందజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు మండల అవోపాకు రూ.25 వేలు, కోఆర్డినేటర్‌ నాగేశ్వర్‌రావు ద్వారా రూ.11 వేలు సం ఘానికి విరాళంగా ప్రకటించారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు బన్నూరు కృష్ణమూర్తి, అవోపా కార్యదర్శి సురేష్‌, కోశాధికారి సూర్యనారాయణ, సురేంద్ర, సురేష్‌, ఎం.సత్యం, బి.సురేష్‌, ఎం.సత్యనారాయణ, ఎ. బ్రహ్మం, రుక్మిణమ్మ పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-04T04:50:33+05:30 IST