వారిని ఎన్నికల విధులనుంచి తప్పించండి: ఉత్తమ్
ABN , First Publish Date - 2021-04-16T09:30:11+05:30 IST
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎ్సకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆరుగురు పోలీసు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎ్సకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆరుగురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్నసీఐలు వీరరాఘవులు, గౌరీ నాయుడు, సురేష్, బాషా, ఆదిరెడ్డితో పాటు మరో అధికారి ఎన్డీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని, వారందరూ ఇక్కడ టీఆర్ఎ్సకు అనుకూలంగా పని చేస్తున్నట్లు ఆరోపించారు.