అవంతీ ఫీడ్స్ రూ.125 కోట్ల పెట్టుబడులు
ABN , First Publish Date - 2021-11-25T08:59:22+05:30 IST
రొయ్యల మేత తయారీ సామర్థ్యాలను అవంతీ ఫీడ్స్ పెంచనుంది. ప్రస్తుతం ఏడాదికి 6 లక్షల టన్నులు ఉండగా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రొయ్యల మేత తయారీ సామర్థ్యాలను అవంతీ ఫీడ్స్ పెంచనుంది. ప్రస్తుతం ఏడాదికి 6 లక్షల టన్నులు ఉండగా.. దీన్ని 7.75 లక్షల టన్నులకు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రూ.125 కోట్లు వెచ్చించి 1.75 లక్షల టన్నుల సామర్థ్యంతో కొత్త రొయ్యల మేత యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ 2022 నాటికి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించగలదని పేర్కొంది.