మనీ ల్యాండరింగ్లో చంద్రబాబు దిట్ట: అవంతి
ABN , First Publish Date - 2020-02-16T01:20:46+05:30 IST
మనీ ల్యాండరింగ్లో చంద్రబాబు దిట్ట అని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ అవినీతి వల్లే ప్రధాని మోదీకి దూరమయ్యారని చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా..
విశాఖ: మనీ ల్యాండరింగ్లో చంద్రబాబు దిట్ట అని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ అవినీతి వల్లే ప్రధాని మోదీకి దూరమయ్యారని చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు డబ్బు పంపారని ఆరోపించారు. సాక్ష్యాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు, లోకేష్, పాస్పోర్టులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జనసేనాని పవన్కు నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు అక్రమాల్ని ప్రశ్నించాలన్నారు. బీజేపీతో తమకేమీ శత్రుత్వం లేదని అవంతి శ్రీనివాస్ చెప్పారు.