పవన్‌ను ఇబ్బంది పెట్టలేదు: అవంతి

ABN , First Publish Date - 2021-04-11T18:04:50+05:30 IST

జనసేనాని పవన్‌కల్యాణ్ సినిమా విషయంలో తాము ఇబ్బంది పెట్టలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు.

పవన్‌ను ఇబ్బంది పెట్టలేదు: అవంతి

విశాఖ: జనసేనాని పవన్‌కల్యాణ్ సినిమా విషయంలో తాము ఇబ్బంది పెట్టలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. సినిమా టికెట్ల ధరపై సామాన్యులను దృష్టిలో ఉంచుకొనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సినిమాలు చూసి ..ప్రజలు ఓట్లు వేయరని పేర్కొన్నారు. కరోనా కారణంగానే సీఎం జగన్ తిరుపతి సభ రద్దు చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. జగన్‌కి సవాల్ విసిరే స్థాయి మాజీమంత్రి లోకేష్‌కు లేదని అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు.


 వకీల్‌ సాబ్‌ సినిమాకు మూడు రోజులపాటు (9వ తేదీ నుంచి 11 వరకు) ఎగ్జిబిటర్లు నిర్ణయించిన ధరలకు టికెట్లు విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం సవరించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు ఈ నెల 10వ తేదీ వరకు వర్తిస్తాయని... 11వ తేదీ ఆదివారం నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని థియేటర్‌ యాజమాన్యాలకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-04-11T18:04:50+05:30 IST