టెక్నికల్ సమస్యతో కొందరికి పథకాలు చేరట్లేదు : అవంతి

ABN , First Publish Date - 2020-10-17T23:24:24+05:30 IST

టెక్నికల్ సమస్యల వల్ల సంక్షేమ పథకాలు కొందరికి చేరడం లేదని..

టెక్నికల్ సమస్యతో కొందరికి పథకాలు చేరట్లేదు : అవంతి

విశాఖపట్నం : టెక్నికల్ సమస్యల వల్ల సంక్షేమ పథకాలు కొందరికి చేరడం లేదని.. ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చూడాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ సూచించారు. జీవీఎంసీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డు త్వరలోనే పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. సుందరమైన నగరం ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేద్దామని.. రాజకీయాలకు అతీతంగా ఎవరు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. జీవీఎంసీ పరిధిలో రూ. 382 కోట్ల రూపాయలతో ఎనిమిది నియోజకవర్గాల్లో పనులు జరుగుతున్నాయని అవంతి వెల్లడించారు. ఇప్పటి వరకూ 150 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.

Updated Date - 2020-10-17T23:24:24+05:30 IST