బీసీల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి పూలే: మంత్రి అవంతి
ABN , First Publish Date - 2021-04-11T17:41:33+05:30 IST
బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు.
విశాఖ: బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైసీపీ నగర కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీసీల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి పూలే అని కొనియాడారు. అలాగే బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలేనని, ఆయన ఆశయాలు కోసం అందరం కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.