ప్రజలకు అందుబాటులో ఉంటా: తమిళిసై
ABN , First Publish Date - 2021-02-25T08:00:46+05:30 IST
తెలంగాణ ప్రజలకు వర్చువల్ అపాయింట్మెంట్ ద్వారా అందుబాటులో ఉంటానని, గురువారం నుంచి ప్రజలను వర్చువల్ విధానంలో కలుస్తానని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప్రకటించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలకు వర్చువల్ అపాయింట్మెంట్ ద్వారా అందుబాటులో ఉంటానని, గురువారం నుంచి ప్రజలను వర్చువల్ విధానంలో కలుస్తానని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప్రకటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ జనరల్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్త్తుండటంతో తాను తెలంగాణలో లేని సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్చువల్ అపాయింట్మెంట్ కోసం adcrbhyd@gov.in అనే చిరునామాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బుధవారం తెలంగాణ రాజ్భవన్ అధికారులతో పుదుచ్చేరి రాజ్నివాస్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష చేశారు. పక్షవాతానికి గురైన రాజ్భవన్ ఉద్యోగి పరిస్థితిని తెలుసుకొని... మానవతా దృక్పథంతో సహాయం అందించాలని ఆదేశించారు.