అందరికీ అందుబాటులో ఉంటా

ABN , First Publish Date - 2022-01-19T05:53:17+05:30 IST

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు.

అందరికీ అందుబాటులో ఉంటా
గిరిజన గ్రామాల్లో పర్యటిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర

 జడ్పీ చైర్‌పర్సన్‌

ముంచంగిపుట్టు, జనవరి 18: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మంగళవారం ఆమె కిలగాడ పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆమె ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతీ గ్రామంలో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకుంటా నన్నారు. దశల వారీగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జేవీవీఎన్‌ మూర్తి, పి.మల్లికార్జునరావు బి.దామోదరం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:53:17+05:30 IST