ప్రైవేట్‌వైద్యులకు కరోనా చికిత్సపై అవగాహన

ABN , First Publish Date - 2021-04-16T04:48:15+05:30 IST

జిల్లాలోని పది పడకల కంటే ఎక్కువగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్యులకు కరో నా వ్యాధి నియంత్రణపై నిర్వహించాల్సిన చికిత్స గురించి డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్‌ వివరించారు.

ప్రైవేట్‌వైద్యులకు కరోనా చికిత్సపై అవగాహన
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ

నారాయణపేట, ఏప్రిల్‌ 15 : జిల్లాలోని పది పడకల కంటే ఎక్కువగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోని వైద్యులకు కరో నా వ్యాధి నియంత్రణపై నిర్వహించాల్సిన చికిత్స గురించి డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్‌ వివరించారు. గురువారం జిల్లా కేంద్రంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులతో డీఎంహెచ్‌ వో సమావేశమై కరోనా వ్యాధి నియంత్రణకు సహకరించా లని కోరారు. కొవిడ్‌-19 చికిత్స చేసేందుకు సంబంధిత ఆసు పత్రులకు సర్టిఫికెట్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను 10+ఆసుపత్రులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ చికిత్స చేయ వచ్చని ఆయన కోరారు. సమావేశంలో డీఐవో డాక్టర్‌ శైలజ, మాస్‌ మీడియా అధికారి హన్మంతు, ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T04:48:15+05:30 IST