మోదీ జిందాబాద్ అనలేదని.. ఆటోడ్రైవర్‌ను చావబాదారు!

ABN , First Publish Date - 2020-08-09T04:04:16+05:30 IST

ప్రధాని మోదీకి జిందాబాద్ చెప్పలేదని ఓ ఆటోడ్రైవర్‌ను ఇద్దరువ్యక్తులు చావబాదారు.

మోదీ జిందాబాద్ అనలేదని.. ఆటోడ్రైవర్‌ను చావబాదారు!

జైపూర్: ప్రధాని మోదీకి జిందాబాద్ చెప్పలేదని ఓ ఆటోడ్రైవర్‌ను ఇద్దరువ్యక్తులు చావబాదారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతంలో జరిగింది. గఫార్ అహ్మద్ కచావా అనే వ్యక్తి  స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతనితో ఇద్దరు వ్యక్తులకు వాగ్వాదం వచ్చింది. ఈ సమయంలో ‘మోదీ జిందాబాద్’, ‘జైశ్రీరాం’ అంటూ నినాదాలు చేయాల్సిందిగా అహ్మద్‌పై ఆ వ్యక్తులు ఒత్తిడి చేశారు. దానికి అహ్మద్ నిరాకరించడంతో అతని చెంప చెళ్లుమనిపించారు. దీంతో బెదిరిపోయి పారిపోవడానికి ప్రయత్నించానని, కానీ తనను వెంబడించి మరీ చావబాదారని అహ్మద్ చెప్తున్నారు.

Updated Date - 2020-08-09T04:04:16+05:30 IST