ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
ABN , First Publish Date - 2022-05-18T05:41:05+05:30 IST
ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
షాద్నగర్, మే 17: పట్టణంలో ఆటో యూనియన్ నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. షాద్నగర్లో ఆటో యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ అఽధ్యక్షుడిగా గొడుగు శ్రీశైలం ముదిరాజ్, ఉపాఽధ్యక్షుడిగా ధన్రాజ్, కార్యదర్శిగా సాయికుమార్గౌడ్, కోశాఽధికారిగా సామ్రాట్, ఉపకోశాధికారిగా మురళి, చెన్నయ్య సంయుక్తకార్యదర్శిగా సురేష్, మహేష్ రాజు, యూనియన్ కార్యదర్శిగా సంతో్షకుమార్, పవన్, సలహాదారులుగా శ్రీనివాస్ అయూబ్లను కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
17సివిఎల్ 61: మహిళా సంఘం ప్రతినిధులతో హెడ్ల్యాం ఫ్లోరింగ్ ప్రతినిధులు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
షాబాద్, మే 17: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని వెల్స్పన్, హెడ్ల్యాం ఫ్లోరింగ్ సంస్థ ప్రతినిధులు అన్నారు. మాచన్పల్లిలోని శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం నిర్వహిస్తున్న మెక్రమ్ ఆర్ట్ శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ఇంగ్లాండ్కు చెందిన హెడ్ల్యాం ఫ్లోరింగ్ సంస్థ, హైతాబాద్లోని వెల్స్పన్ ఫ్లోరింగ్ సంస్థ ప్రతినిధులు సందర్శించారు. హైతాబాద్, నాగర్కుంట గ్రామాల్లో విద్యా, వైద్యం, మహిళా సాధికారత రంగాల్లో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను విదేశీ ప్రతినిధులకు వివరించారు. అనంతరం వెల్స్పన్ ఫ్లోరింగ్ తరఫున మాచన్పల్లి పాఠశాలకు 2 తివాచీ(కార్పెట్)లను అందజేశారు. కార్యక్రమంలో వెల్స్పన్ ఫ్లోరింగ్ సంస్థ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ముఖేశ్ సావ్లాని, జనరల్ మేనెజర్ రాజీవ్ గాధోక్, డిప్యూటీ మేనేజర్ భువనేశ్వరీ, సురేఖ, కోఆర్డీనేటర్ భద్రయ్య, సర్పంచ్ మహేందర్రెడ్డి, గ్రామస్థులు రామస్వామి, మురళీమోహన్, మహిళా సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.