తీవ్ర మనస్తాపంతో ఆటో ట్రాలీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-05-10T14:28:33+05:30 IST

తీవ్ర మనస్తాపానికి గురైన ఆటో ట్రాలీ డ్రైవర్‌ ఒంటిపై

తీవ్ర మనస్తాపంతో ఆటో ట్రాలీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌ : తీవ్ర మనస్తాపానికి గురైన ఆటో ట్రాలీ డ్రైవర్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పుపెట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రగాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఓల్డ్‌మలక్‌పేట శంకర్‌నగర్‌ నివాసి సయ్యద్‌ అబ్దుల్‌(28) ఆటో ట్రాలీ డ్రైవర్‌. 6ఏళ్ల క్రితం సల్మాబేగంతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలున్నారు. ఆటో ట్రాలీలో ఉల్లిగడ్డలు విక్రయించి జీవనం సాగిస్తున్నాడు.


ఇటీవల ఇంట్లో జరిగిన గొడవకు మనస్తాపంతో అబ్దుల్‌ ఇంటికి వెళ్లకుండా ఆటో ట్రాలీలోనే ఉంటున్నాడు. తీవ్ర మనస్తాపంతో శనివారం మధ్యాహ్నం మద్యం తాగి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మంటలకు తాళలేక కేకలు వేయడంతో స్థానికులు చాదర్‌ఘాట్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే చేరుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 90శాతం కాలిన గాయాలతో అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్టు చాదర్‌ఘాట్‌ ఎస్‌ఐ శేషు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2020-05-10T14:28:33+05:30 IST