బైక్‌పై నుంచి పడి.. ఆటోట్రాలీ దూసుకెళ్లడంతో మృతి!

ABN , First Publish Date - 2022-02-22T11:56:34+05:30 IST

ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి కిందపడ్డ

బైక్‌పై నుంచి పడి.. ఆటోట్రాలీ దూసుకెళ్లడంతో మృతి!

హైదరాబాద్ సిటీ/రాంనగర్‌ : ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి కిందపడ్డ వ్యక్తి పైనుంచి ఆటో ట్రాలీ దూసుకెళ్లడంతో మృతి చెందాడు. ముషీరాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం.. గాంధీనగర్‌లో ఉంటున్న మహ్మద్‌ ఆజర్‌ హుస్సేన్‌ (34) అంబర్‌పేటలోని ఓ కంపెనీలో సైట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. సోమవారం ఉదయం 11.40 సమయంలో హుస్సేన్‌ తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గోల్కొండ చౌరస్తా సమీపంలోని స్పెన్సర్స్‌ వద్ద అదుపుతప్పి పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆటోట్రాలీ అతడి ఛాతీపై నుంచి వెళ్లింది. దీంతో హుస్సేన్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు ముషీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న హుస్సేన్‌ను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో హుస్సేన్‌ సాయంత్రం చనిపోయాడు. మృతుడి బంఽధువుల ఫిర్యాదు మేరకు సీఐ జహంగీర్‌యాదవ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-02-22T11:56:34+05:30 IST