ఆటో బోల్తా... వ్యక్తి దుర్మరణం
ABN , First Publish Date - 2021-01-18T05:09:09+05:30 IST
కుప్పిలి గ్రామానికి సమీపంలో ఆదివారం ఉదయం ఆటో బోల్తాపడిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మర ణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ఎచ్చెర్ల : కుప్పిలి గ్రామానికి సమీపంలో ఆదివారం ఉదయం ఆటో బోల్తాపడిన ఘటనలో ఒక వ్యక్తి దుర్మర ణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. రణస్థలం మండలం గోసాం గ్రామానికి చెందిన వీరు ఆటోలో పాతరపల్లిలోని భద్ర మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా కుప్పిలి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గిన్ని రాముడు (35) అక్కడికక్కడే మృతి చెందగా... కంబాల బొడ్డోడు, కాలపురెడ్డి సీతయ్య తీవ్రంగా గాయపడ్డారు. కాగా రాముడుకి భార్య లక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతదేహానికి పోలీసులు శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.