ఆటో బోల్తా...మహిళ మృతి
ABN , First Publish Date - 2021-01-16T05:41:01+05:30 IST
జాతీయరహదారి పలాస బైపాస్ రోడ్డు పారసంబ వద్ద శుక్రవారం ఉదయం ఆటోబోల్తా పడడంతో బైనపల్లి లచ్చి(55) అక్కడికక్కడే మృతిచెందింది.
ఐదుగురికి తీవ్ర గాయాలు
చేపలు విక్రయించడానికి వెళ్తుండగా ప్రమాదం
పలాస:జాతీయరహదారి పలాస బైపాస్ రోడ్డు పారసంబ వద్ద శుక్రవారం ఉదయం ఆటోబోల్తా పడడంతో బైనపల్లి లచ్చి(55) అక్కడికక్కడే మృతిచెందింది. అందులో ప్రయాణి స్తున్న డ్రైవర్తోపాటు మరో నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు... వజ్రపుకొ త్తూరు మండలంలోని నువ్వలరేవు గ్రామానికి చెందిన లచ్చితోపాటు డ్రైవర్ బైనపల్లి భాస్కర్, బెహరా సావిత్రి, మువ్వల పార్వతి, ఎం.దమయంతి, డారిమో బైనపల్లిలు చేపలు విక్రయానికి మెళియాపుట్టి మండలంలోని గొప్పిలి ఆటోలో వెళ్తున్నారు.ఈ క్రమంలో జాతీయరహదారిపై వెళ్తుండగా పారసంబ వద్ద రోడ్డుకు అడ్డంగా అడవిపందుల గుంపు రావడంతో దాన్ని తప్పించబోయి ఆటోపక్కకు తిప్పారు. దీంతో అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ప్రయా ణిస్తున్న లచ్చి అక్కడే మృతిచెందగా మిగిలినవారికి తీవ్ర గాయాలయ్యాయి. కాశీబుగ్గ ఎస్ఐ శిరీష సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు బాధితుల నుంచి అడిగి తెసుకున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వెంకటరమణ (ఫైల్) : పలాస 7